పండ్లు, కూరగాయల తొక్కలతో లాభాలు ఎన్నో!

Benefits of using fruit and vegetable skins are many. మనం పండ్లు కూరగాయలను కట్ చేసినప్పుడు వాటి తొక్కలను తీసి పడేస్తుంటాము.

By అంజి  Published on  5 Feb 2023 1:15 PM GMT
పండ్లు, కూరగాయల తొక్కలతో లాభాలు ఎన్నో!

మనం పండ్లు కూరగాయలను కట్ చేసినప్పుడు వాటి తొక్కలను తీసి పడేస్తుంటాము. కానీ వాటితో చాలా ఉపయోగాలుంటాయి. వాటిలో ఆమ్లగుణాలు ఎక్కువగా ఉంటాయి. అవి క్లీనింగ్ ఏజెంట్‌గా, క్రిమి సంహారిణిగా పనిచేస్తాయి. ఇంకా ఎలా ఉపయోగపడుతాయో ఇప్పుడు చూద్దాం..

*వంటింట్లో గ్యాస్ స్టవ్ దగ్గర, సింక్ దగ్గర,కుళాయిలపై మరకలు ఎక్కువగా అవుతుంటాయి. అలాంటప్పుడు మరకలపై నిమ్మ తొక్కలతో రుద్దితే మరకలు మాయమవుతాయి. వాటిలో ఉండే ఆమ్లగుణాలు ఆయా వస్తువుల్ని కొత్తగా కనిపించేలా చేస్తాయి.

*బాత్‌రూమ్‌, సింక్ వద్ద బ్యాక్టీరియా, క్రిములు ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించడం కోసం నిమ్మ తొక్కల్ని నీటిలో వేసి మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి స్ప్రేబాటిల్‌లో పోసుకొని.. సింక్, బాత్‌రూమ్‌లో స్ప్రే చేస్తూ ఉండాలి. అలా క్రిములు, బ్యాక్టీరియా అంతమవుతాయి. సువాసన కూడా వెదజల్లుతుంది.

*చర్మంపై వచ్చే అలర్జీ, దురద, మంట వంటి సమస్యలకు నిమ్మ తొక్కలతో చెక్ పెట్టవచ్చు. దీనికోసం స్నానం చేసే కొన్ని గంటల ముందు నిమ్మ తొక్కలను నీటిలో వేసి ఉంచాలి. ఆ తర్వాత వాటిని తీసేసి స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.

*ముఖంపై మొటిమలు, మచ్చలు చిరాకు తెప్పిస్తాయి. అటువంటి సమయంలో పండ్లు, కూరగాయల తొక్కలను ఎండబెట్టి వాటితో పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పొడిలో కొంచెం తేనె, ముల్తానీ మట్టి, రోజ్ వాటర్, పెరుగు కలిపి ముఖానికి రాసుకొని అర్థగంట తరువాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే మొటిమలు మాయమవుతాయి.

*ఇంట్లోకి చీమలు, బొద్దింకలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ సమయంలో కీరా తొక్కలను ఇంట్లో అక్కడక్కడా వేయాలి. ఇలా వేయడం వల్ల చీమలు, బొద్దింకలు ఇంట్లోకి రావు.

*పండ్లు, కూరగాయల తొక్కలతో సహజ ఎరువులను కూడా తయారు చేసుకోవచ్చు. దాని కోసం ముందుగా తొక్కలను కాసేపు ఎండ బెట్టి.. ఆ తర్వాత మట్టితో కలిపి కొన్నాళ్ల పాటు అలాగే ఉంచితే సహజ ఎరువు తయారవుతుంది. దీనిని ఉపయోగించడం వల్ల పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. భూసారం కూడా పెరుగుతుంది.

*నిమ్మ తొక్కలతో టీ కూడా తయారు చేసుకోవచ్చు. దీనికోసం కొన్ని నీళ్లలో తొక్కల్ని వేసి మరిగించాలి. ఆ తర్వాత ఒక గ్లాసులో తియ్యదనం కోసం చెంచా తేనె తీసుకొని దానిలో మరిగించిన నీటిని పోసుకోవాలి. ఈ టీ తాగడం వల్ల తలనొప్పి, వాంతులు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Next Story