భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sep 2020 5:02 AM GMT
భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 96,424 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1174 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడింది. దీంతో దేశంలో పాజిటివ్‌ కేసులు సంఖ్య 52,14,678కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 41,12,522 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 10,17,754 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 84,372 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78.64శాతం ఉండగా.. మరణాల రేటు 1.63శాతంగా ఉంది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. 68లక్షల కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉంది. ఇక దేశంలో కరోనా వ్యాప్తి ఇలాగే కొనసాగుతే.. కొద్ది రోజుల్లోనే మొదటి స్థానానికి చేరుకుంటామని పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story