Telangana: డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు

డీఎస్సీ దరఖాస్తుల గడువు తేదీని పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  20 Oct 2023 12:00 PM GMT
telangana, dsc application, date extended,  oct 28th,

Telangana: డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20 నుంచి ఈ పోస్టులకు భర్తీ కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అక్టోబర్‌ 21వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ముగియనుంది. అయితే.. అభ్యర్థులు గడువు పొడిగించాలంటూ అభ్యర్థన చేశారు. అంతేకాకుండా పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ దరఖాస్తుల గడువు తేదీని పొడిగించాలని ఈ నిర్ణయం తీసుకుంది. గడువని అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

కాగా.. ఈ సారి డీఎస్సీకి అప్లికేషన్లు తక్కువగా వచ్చాయని తెలుస్తోంది. ఉపాధ్యాయ పోస్టుల పోటీ తక్కువగా ఉంటుందనే విశ్లేషణలు ఉన్నాయి. కానీ రిజర్వేషన్ వారీగా కోటాల ప్రకారం ఆశించినన్ని ఖాళీలకు నోటిఫికేషన్ రాలేదని.. దాదాపు 15వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా కేవలం 5వేల పోస్టులు మాత్రమే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారని అంటున్నారు. అందుకే అభ్యర్థుల నుంచి స్పందన లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా.. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్​ 20 నుంచి పది రోజుల పాటు సీబీఆర్​టీ విధానంలో డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. ఎన్నికల కారణంగా ఈ పరీక్షల తేదీలను వాయిదా వేశారు. మరోవైపు బీఈ, బీటెక్‌తో బీఈడీ ఉన్న అభ్యర్థులు కూడా టీచర్​ పోస్టులకు అర్హులేనని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పరీక్షలు వాయిదా పడ్డందున.. అప్లికేషన్ల గడువును పొడిగించాలని అభ్యర్థులు విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అప్లికేషన్ల గడువును మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

Next Story