స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2,402 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు జూన్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జూన్ 24 వరకు చెల్లించవచ్చు. దరఖాస్తుల్లో సవరణకు జూన్ 28 నుంచి జూన్ 30 వరకు అవకాశం ఇస్తారు. ఈ పోస్టులను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో గ్రూప్ - సీ, గ్రూప్ - డీ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్లకు ఫీజు నుంచి మినహాయింపు కలదు.
రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జులై 24 నుంచి ఆగస్టు 4 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవెర్నెస్, క్యాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. 100 ప్రశ్నలు.. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://ssc.gov.in/ ను సంప్రదించండి.