15,762 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ
జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 15,762 (పెంచిన తరువాత) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.
By - అంజి |
15,762 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ
జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 15,762 (పెంచిన తరువాత) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కేవీఎస్లో 9,921, ఎన్వీఎస్లో 5841 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ, బీఈడీ, ఎంఈడీ, ఎంసీఏ, ఎంపెడ్, సీటెట్, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. సీబీటీ, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. పూర్తి వివరాలు https://www.cbse.gov.in/ లో తెలుసుకోవచ్చు.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) లకు వివిధ బోధన, బోధనేతర పోస్టుల నియామకాలను నిర్వహించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ, బీఈడీ, ఎంఈడీ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, ఎంపెడ్, బీసీఏ, బీఈ, బీటెక్, సీటెట్, బీపెడ్, B.Lisc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
మొదటిసారిగా సీబీఎస్ఈ కేవీఎస్, ఎన్వీఎస్లకు నియామక పరీక్ష మరియు ఎంపికను ఒకేసారి నిర్వహిస్తోంది, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), ప్రైమరీ టీచర్ (PRT), వివిధ అడ్మినిస్ట్రేటివ్ , నాన్-టీచింగ్ పాత్రలు వంటి విస్తృత శ్రేణి పోస్టులను కవర్ చేస్తుంది. KVS NVS రిక్రూట్మెంట్ 2025 కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్ను 13 నవంబర్ 2025న విడుదల చేసిన అధికారిక నోటీసు ద్వారా తెలియజేయబడింది. ఈ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తులకు ఇవాళ ఒక్క రోజు మాత్రమే అవకాశం ఉంది.