జగన్‌ ఆస్తుల కేసు.. మళ్లీ వాయిదా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2020 2:44 PM GMT
జగన్‌ ఆస్తుల కేసు.. మళ్లీ వాయిదా..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసును హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టు మళ్లీ వాయిదా వేసింది. ప్రభుత్వ పరమైన కార్యక్రమాల వల్ల తాను కోర్టుకు హాజరుకాలేనంటూ జగన్‌ తన లాయర్ల ద్వారా వేసిన ఆబ్సెంట్‌ పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. ఈ కేసులో సహనిందితులైన శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లు కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి కేసును ఈనెల 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

Next Story