అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా..రెండో భారతీయుడిగా రికార్డు
భారత అంతరిక్ష యాత్రలో చరిత్రాత్మక క్షణం ఆవిష్కృతమైంది.
By Knakam Karthik
అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా..రెండో భారతీయుడిగా రికార్డు
భారత అంతరిక్ష యాత్రలో చరిత్రాత్మక క్షణం ఆవిష్కృతమైంది. 41 ఏళ్ల తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్రకు బయల్దేరారు. యాక్సియం-4 మిషన్లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు కలిసి అంతరిక్ష యాత్రను చేపట్టారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం బుధవారం 12:01గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరనున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డులకెక్కనున్నారు.
దాదాపు 28 గంటల పాటు జరగనున్న ఈ ప్రయాణం రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అంతరిక్ష కేంద్రానికి రాకెట్ అనుసంధానంతో ముగుస్తుంది. శుభాంశు శుక్లా బృందం 14 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేయనుంది. ఈ చారిత్రక యాక్సియమ్-4 మిషన్ ద్వారా భారత్, పోలాండ్, హంగేరీ దేశాలు 40 ఏళ్లకు పైగా విరామం తర్వాత మానవసహిత అంతరిక్ష యాత్రలను పునఃప్రారంభించాయి. ఈ మూడు దేశాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒకేసారి మిషన్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. శుభాంశు శుక్లా తన 14 రోజుల అంతరిక్ష పర్యటనలో పలు కీలకమైన శాస్త్రీయ ప్రయోగాలు చేపట్టనున్నారు.
WATCH | #Axiom4Mission lifts off from NASA's Kennedy Space Centre in Florida, US. The mission is being piloted by India's IAF Group Captain Shubhanshu Shukla. The crew is travelling to the International Space Station (ISS) on a new SpaceX Dragon spacecraft on the company's Falcon… pic.twitter.com/jPDKcB44NM
— ANI (@ANI) June 25, 2025