"జాయ్ బంగ్లా"ను దేశ జాతీయ నినాదంగా చేయాలని నిర్ణయం
‘Joy Bangla’ To Be National Slogan Of Bangladesh. బంగ్లాదేశ్ ప్రభుత్వం "జాయ్ బంగ్లా"ను దేశ జాతీయ నినాదంగా చేయాలని నిర్ణయించింది. ప్రధాని షేక్ హసీనా అధ్యక్షతన
By అంజి Published on
21 Feb 2022 3:10 AM GMT

బంగ్లాదేశ్ ప్రభుత్వం "జాయ్ బంగ్లా"ను దేశ జాతీయ నినాదంగా చేయాలని నిర్ణయించింది. ప్రధాని షేక్ హసీనా అధ్యక్షతన ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్టు కేబినెట్ సెక్రటరీ ఖండ్కేర్ అన్వరుల్ ఇస్లాం సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. మంత్రులు సచివాలయంలోని సమావేశ మందిరం నుండి సమావేశంలో పాల్గొన్నారు. అయితే హసీనా తన అధికారిక గణభబన్ నివాసం నుండి వర్చువల్గా సమావేశంలో చేరారు. క్యాబినెట్ సెక్రటరీ ఇలా అన్నారు. "హైకోర్టు జారీ చేసిన 'జాయ్ బంగ్లా' జాతీయ నినాదం చేయడానికి తీర్పు ఉంది. కేబినెట్ విభాగం ఈ విషయాన్ని చర్చించి, 'జాయ్ బంగ్లా' జాతీయ నినాదం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడానికి ఆదేశాలతో ముందుకు వచ్చింది."
Next Story