గంజాయి మిఠాయిలు తిని.. 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు

గంజాయి కలిపిన మిఠాయిలని అనుకోకుండా తిన్న 60 మందికి పైగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆసుపత్రి పాలైనట్లు అధికారులు తెలిపారు.

By అంజి  Published on  4 Oct 2023 2:45 AM GMT
Jamaica, cannabis sweets, 60 school kids hospitalised, international news

గంజాయి మిఠాయిలు తిని.. 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు

గంజాయి కలిపిన మిఠాయిలని అనుకోకుండా తిన్న 60 మందికి పైగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆసుపత్రి పాలైనట్లు అధికారులు తెలిపారని సీఎన్‌ఎన్‌ రిపోర్ట్‌ చేసింది. ఈ ఘటన జమైకా దేశంలో జరిగింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సెయింట్ ఆన్స్ బే ప్రాంతానికి చెందినవారు. రాజధాని కింగ్‌స్టన్ నుండి 80కిమీ (50 మైళ్ళు) దూరంలో ఈ ఘటన జరిగింది. వైద్యుల తెలిపిన వివరాల ప్రకారం.. 7 నుండి 12 సంవత్సరాల వయస్సు గల బాధిత పిల్లలు అస్వస్థతకు గురయ్యారని, అయితే ఎవరీ పరిస్థితి కూడా విషమంగా లేదని విద్య, యువజన మంత్రి ఫేవల్ విలియమ్స్ తెలిపారు.

మిఠాయిని తీసుకోవడం వల్ల పిల్లలలో వాంతులు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి అని మంత్రి విలియమ్స్ వెల్లడించారు. కొంతమంది పిల్లలు సెలైన్లు ఎక్కించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై మంత్రి విలియమ్స్ తన ఆందోళనను వ్యక్తం చేశారు. 60 మందికి పైగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులను దయచేసి జాగ్రత్త ఉండాలని సూచించారు. చిన్నారులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని తాను సందర్శించానని, విద్యార్థులు కోలుకునేలా కృషి చేస్తున్న వైద్యులు, నర్సుల కృషిని మంత్రి అభినందించారు.

తరువాత పాఠశాల ప్రిన్సిపాల్ జమైకా అబ్జర్వర్‌తో మాట్లాడుతూ "ఒంటరి విక్రేత" తన విద్యార్థులకు స్వీట్‌లను విక్రయించాడని చెప్పారు. సెయింట్ ఆన్ పోలీసు విభాగం అధిపతి, సీనియర్ సూపరింటెండెంట్ డ్వైట్ పావెల్, వ్యక్తి లేదా వారి గురించి సమాచారం ఉన్న ఎవరైనా అధికారులను సంప్రదించాలని కోరారు. మంత్రి విలియమ్స్ ఉత్పత్తి ప్యాకేజింగ్ యొక్క ఫోటోలను పోస్ట్ చేసారు. ఇది వాటిని మైనర్‌లకు విక్రయించకూడదని నిర్దేశిస్తుంది. దక్షిణాఫ్రికాలో దాదాపు 90 మంది చిన్నారులు డ్రగ్స్ కలిపిన మఫిన్‌లను తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు.

Next Story