బీరూట్పై బుధవారం ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడింది. హిజ్బుల్లాతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రాజధానిపై జరిగిన అత్యంత హింసాత్మక దాడి ఇదే కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లెబనాన్ అంతటా తాము "అతిపెద్ద సమన్వయ దాడి"ని నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
ఇరాన్తో కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తించదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా రాజధానిలో ఏకకాలంలో దాడులు జరగడంతో, జనం వీధుల్లో పరుగులు తీశారు. వాహనదారులు ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి హారన్లు కొడుతూ గందరగోళ పరిస్థితి నెలకొంది.