ఇరాన్‌కు మరో దెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఐఆర్‌జిసి ప్రతినిధి మృతి

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌లు ఒకరిపై ఒకరు వరుస దాడులు చేసుకుంటున్నాయి.

By -  Medi Samrat
Published on : 20 March 2026 4:20 PM IST

ఇరాన్‌కు మరో దెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఐఆర్‌జిసి ప్రతినిధి మృతి

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌లు ఒకరిపై ఒకరు వరుస దాడులు చేసుకుంటున్నాయి. సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ, ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌తో సహా పలువురు ఉన్నత సైనికాధికారులు హత్యకు గురికావడంతో ఇరాన్ భారీ ఎదురుదెబ్బను ఎదుర్కొంది.

ఐఆర్‌జిసి (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ప్రధాన అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అలీ మహమ్మద్ నయీని ఇరాన్‌లో జరిగిన దాడిలో మరణించారు. ఐఆర్‌జిసి అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అలీ మహమ్మద్ నయీని మరణాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ శుక్రవారం ధృవీకరించింది.

గురువారం, ఇరాన్ గూఢచార మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ప్రకటించాయి. 2022-2023 మహసా అమిని నిరసనల సమయంలో ఖతీబ్ ఇరాన్ పౌరులకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఐడీఎఫ్ తెలిపింది.

Xలో ఒక పోస్ట్‌లో IDF బుధవారం ఇలా పేర్కొంది.. "ఇరాన్ ఉగ్రవాద పాలన యొక్క గూఢచార మంత్రి అయిన ఖతాబ్ ఇస్మాయిల్ ఖతీబ్, టెహ్రాన్‌లో జరిగిన ఒక లక్షిత దాడిలో హతమయ్యారు. ఇరాన్ వ్యాప్తంగా ఇటీవల జరిగిన నిరసనల సమయంలో ప్రదర్శనకారుల అరెస్టులు, హత్యలతో సహా, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెలీలు, అమెరికన్లపై ఉగ్రవాద కార్యకలాపాలకు నాయకత్వం వహించడంలో ఖతీబ్ కీలక పాత్ర పోషించారు."

Next Story