సుప్రీంకోర్టు షాక్‌తో ట్రంప్ 10శాతం సుంకాలు..పరిణామాలపై భారత్ సమీక్ష

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తదుపరి చర్యల ప్రభావాలను అంచనా వేస్తున్నట్లు భారత ప్రభుత్వం శనివారం తెలిపింది

By -  Knakam Karthik
Published on : 21 Feb 2026 6:36 PM IST

Delhi, Trump Tariffs, US Supreme Court, Indian Economy, Global Trade, Govt Of India

సుప్రీంకోర్టు షాక్‌తో ట్రంప్ 10శాతం సుంకాలు..పరిణామాలపై భారత్ సమీక్ష

ఢిల్లీ: అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల సుంకాలపై ఇచ్చిన తీర్పు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తదుపరి చర్యల ప్రభావాలను అంచనా వేస్తున్నట్లు భారత ప్రభుత్వం శనివారం తెలిపింది. అమెరికా సుంకాల పరిణామాలు మరియు వాటి పర్యవసానాలను భారత ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.

శుక్రవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ప్రస్తావించింది. సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు నిన్న (శుక్రవారం) ఇచ్చిన తీర్పును మేము గమనించాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు" అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై అక్కడి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వడం, ఆ తర్వాత ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పరిణామాల వల్ల భారత్‌పై పడే ప్రభావంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తోంది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, తదుపరి చర్యలపై విశ్లేషిస్తున్నామని భారత ప్రభుత్వం తెలిపింది.

ట్రంప్ కొత్త నిర్ణయం:

కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని దేశాల నుండి వచ్చే దిగుమతులపై 10% గ్లోబల్ టారిఫ్ విధిస్తూ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇది ఫిబ్రవరి 24 ఉదయం (IST) నుండి అమలులోకి రానుంది. వైట్ హౌస్ స్పష్టీకరణ ప్రకారం.. భారతీయ వస్తువులపై ఇప్పుడు 10% రెసిప్రోకల్ లెవీ పడే అవకాశం ఉంది. దీనివల్ల మొత్తం సుంకం దాదాపు 13.5% కి చేరవచ్చు, అయితే దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

Next Story