అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ఉచిత సేవా కేంద్రం

Good News For Students. ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లే విద్యార్థులకు శుభవార్త. యూఎస్‌

By Medi Samrat  Published on  4 March 2021 4:05 AM GMT
Good News For Students
ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లే విద్యార్థులకు శుభవార్త. యూఎస్‌ వెళ్తున్న తెలుగు విద్యార్థుల సౌకర్యం కోసం అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణలో పని చేస్తున్న యూఎస్‌ఏ ఎడ్యుకేషన్ సంస్థ హైదరాబాద్‌లో ఉచిత సేవా కేంద్రాన్ని వైయాక్సిస్‌ సంస్థతో కలిసి ఏర్పాటు చేయనుంది. అయితే ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ సంస్థ ఇలాంటి సేవా కేంద్రాన్ని మన దేశంలో ఏర్పాటు చేయడం మొదటిసారి. అది కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయడం విశేషం.


ఈ కొత్త సేవా కేంద్రాన్ని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో శుక్రవారం ప్రారంభించనుంది. అమెరికాలో ఉన్నత చదువుల కోసం దేశం నుంచి వెళుతున్న విద్యార్థుల్లో 40 శాతానికి పైగా తెలుగువారే ఉన్నారు. ఏ అర్హతలున్న వారు ఎలాంటి విశ్వవిద్యాలయాలను ఎంచుకోవాలి? ఫీజులు ఎలా చెల్లించాలి? స్టూడెం ట్‌ వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే ఆంశాలపై అవగాహన లేక విద్యార్థులు బోగస్‌ సంస్థల చేతిలో దారుణంగా మోసపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో విద్యార్థుల చదువు కారణంగా సమయాన్ని, డబ్బును వృధా చేసుకుంటున్నారు.

విద్యార్థులకు ఆ ఇబ్బందులు తప్పించి సరైన సహాలు అందించేందుకు కొత్త సేవా కేంద్రం ఎంతగానో ఉపయోగపడనుంది. విద్యార్థుల కోసం హైదరాబాద్‌ బేగంపేటలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీలో అమెరికన్‌ కార్నర్‌ పేరుతో ఇప్పటికే ఒక కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఆ సేవా కేంద్రం వారంలో ఒక రోజు మాత్రమే ఉంటుంది. పైగా ముందుగా అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఆ కేంద్రం నుంచి సేవలు పొందాల్సి ఉంటుంది. ఇక కొత్త కేంద్రం వారంలో ఐదు రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు పని చేస్తుంది. పైగా విద్యార్థులు నేరుగా ఈ కేంద్రానికి వెళ్లి అక్కడ ఉండే నిపుణులను కలిసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.


Next Story