భార‌త్‌లో 14 రోజులు ఉంటే జైలు శిక్ష.. నేటి నుంచే అమ‌లు అంటున్న ఓ దేశం..!

Australians to face jail if they go home from india.ఇప్పటి వరకు భారత్ నుంచి రాకపోకలు బంద్ చేసిన దేశాలు చూసాం. భారత్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2021 3:36 AM GMT
భార‌త్‌లో 14 రోజులు ఉంటే జైలు శిక్ష.. నేటి నుంచే అమ‌లు అంటున్న ఓ దేశం..!

ఇప్పటి వరకు భారత్ నుంచి రాకపోకలు బంద్ చేసిన దేశాలు చూసాం. భారత్ నుండి ఇతర దేశాలకు వెళ్ళేవారు వచ్చే వారు కొన్ని రోజులు క్వారాంటైన్ లో ఉండాలని ఆయా దేశాలు తేల్చి చెప్పిన విషయము విన్నాం.. కానీ ఆస్ట్రేలియా చేసిన ఓ ప్రకటన అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకంటే భారత్‌లో 14 రోజుల పాటు ఉండి.. ఆ తర్వాత తమ దేశంలో ఆస్ట్రేలియా పౌరులు అడుగుపెడితే.. అలా వచ్చిన వారికి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాకుండా.. 66వేల డాలర్ల వరకూ జరిమానా కూడా విధిస్తామని ప్రకటించింది. స్వదేశీ పౌరులపై ఈ తరహా కఠినమైన ఆంక్ష విధించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న వేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 14 రోజుల పాటు ఉండి.. ఆ తర్వాత తమ దేశంలో ఆస్ట్రేలియా పౌరులు అడుగుపెడితే.. అలా వచ్చిన వారికి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష, 66వేల డాలర్ల వరకూ జరిమానా కూడా విధిస్తామని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన శనివారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బయోసెక్యూరిటీ చట్టం ప్రకారం ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. భారత్‌లో రోజుకు 3 లక్షల 80 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్న తరుణంలో.. కరోనా కట్టడిలో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం మూడు వారాల క్రితమే తాత్కాలిక నిషేధం విధించింది.

భారత్‌లో కొత్తగా వేరియంట్ కేసులు వెలుగుచూస్తున్న తరుణంలో తమ దేశ పౌరులైనా భారత్ నుంచి వస్తే ఉపేక్షించేది లేదని ఆస్ట్రేలియా తేల్చి చెప్పింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ లెక్కల ప్రకారం, భారత్‌లో మొత్తం 9వేల మంది ఆస్ట్రేలియా దేశస్తులు నివసిస్తున్నారు. ఇందులో.. సుమారు 600 మందికి కరోనా సోకి ఉండే అవకాశం ఉందని అంచనా. భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్‌లో భాగంగా కొందరు ఆస్ట్రేలియా క్రికెటర్లు, శిక్షణా సిబ్బంది ఇండియాలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిలో కొందరు ఇంటి బాట పట్టారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి విమాన ప్రయాణాలపై నిషేధం విధించినప్పటికీ ఆసీస్ క్రికెటర్లు భారత్ నుంచి ఖతర్‌కు వెళ్లి.. అక్కడి నుంచి మెల్‌బోర్న్‌కు కమర్షియల్ ఫ్లైట్‌లో చేరుకున్నట్టు సమాచారం.


Next Story