సైనిక విమానానికి ప్రమాదం.. 46 మంది సజీవదహనం
సూడాన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 46 మంది సజీవదహనం అయ్యారు.
By Knakam Karthik
సైనిక విమానానికి ప్రమాదం.. 46 మంది సజీవదహనం
సూడాన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 46 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుందని అక్కడి మీడియా వెల్లడించింది. వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి ఓ సైనిక విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో సైనిక సిబ్బంది, పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో పది మంది గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదని.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఖార్టూమ్ సమీపంలోని వాది సీద్నా ఆర్మీ ఎయిర్ బేస్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నుంచి గాయాలతో బయటపడ్డ ప్రయాణికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రాథమిక దర్యాఫ్తులో విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
A Sudanese Air Force transport aircraft crashes shortly after takeoff from Wadi Sidna Air Base in Omdurman, near Khartoum, killing at least 46 people.#planecrash #Sudan #AirCrash #Sudanese pic.twitter.com/fA6yQpz5go
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) February 26, 2025