అమెరికాలో బస్సు బోల్తా, ఏడుగురు దుర్మరణం

అమెరికాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మిస్సిస్సిప్పిలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.

By Srikanth Gundamalla  Published on  1 Sept 2024 9:08 AM IST
అమెరికాలో బస్సు బోల్తా, ఏడుగురు దుర్మరణం

అమెరికాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మిస్సిస్సిప్పిలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఇంటర్‌స్టేట్‌ రూట్‌ 20లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని.. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.

వారెన్ కౌంటీలోని బోవినా సమీపంలో బస్సు హైవేపై నుండి జారిపడి బోల్తా పడింది. టైరు పగిలిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సంఘటనా స్థలంలోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన తర్వాత చికిత్స పొందుతూ చనిపోయాడని చెప్పారు. మృతుల్లో ఆరేళ్ల బాలుడు ఉన్నాడని పేర్కొన్నారు అధికారులు. అతని 16 ఏల్ల సోదరి కూడా ఉన్నట్లు వెల్లడించారు. మిగిలిన వారిని గుర్తించేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే.. గాయపడ్డ 37 మంది ప్రయాణికులను విక్స్‌బర్గ్, జాక్స్‌లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది.

Next Story