ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది పిల్లలు సహా 71 మంది మరణించారు. అందులో ఒక ప్రయాణీకుల బస్సు ట్రక్కు, మోటార్సైకిల్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని అధికారులు బుధవారం తెలిపారు. ప్రావిన్షియల్ ప్రభుత్వ ప్రతినిధి అహ్మదుల్లా ముత్తాకి ఎక్స్ పోస్ట్లో మరణాల సంఖ్యను ధృవీకరించారు. ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన ట్రాఫిక్ విపత్తులలో ఇది ఒకటి అని పేర్కొన్నారు.
"హెరాత్లో ఒక బస్సు ట్రక్కు మోటార్సైకిల్ను ఢీకొట్టింది, ఫలితంగా 71 మంది మరణించారు" అని ఆయన రాశారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వీడియోలో బస్సు ఢీకొన్న తర్వాత మంటల్లో చిక్కుకున్నట్లు, సమీపంలోని ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నట్లు కనిపిస్తోంది. ఆ బస్సు ఇరాన్ నుండి బహిష్కరించబడిన ఆఫ్ఘన్లను తీసుకెళ్తున్నదని, సరిహద్దు దాటిన తర్వాత కాబూల్ వైపు ప్రయాణిస్తోందని ప్రాంతీయ అధికారి మొహమ్మద్ యూసుఫ్ సయీది AFP కి తెలిపారు. "ప్రయాణీకులందరూ ఇస్లాం ఖాలాలో వాహనం ఎక్కిన వలసదారులు" అని ఇరాన్లోకి ప్రవేశించే కీలకమైన క్రాసింగ్ పాయింట్ను ప్రస్తావిస్తూ సయీది చెప్పారు.