ఘోర ప్రమాదం.. 115 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 55 మంది మృతి

గ్వాటెమాల రాజధాని శివార్లలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం నాడు ఓ బస్సు వంతెనపై నుండి లోయలో పడి పోయింది. ఈ విషాద ఘటనలో 55 మంది మరణించారు.

By అంజి
Published on : 11 Feb 2025 8:11 AM IST

55 dead, bus plunges 115 feet into gorge, multi vehicle crash, Guatemala

ఘోర ప్రమాదం.. 115 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 55 మంది మృతి

గ్వాటెమాల రాజధాని శివార్లలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం నాడు ఓ బస్సు వంతెనపై నుండి లోయలో పడి పోయింది. ఈ విషాద ఘటనలో 55 మంది మరణించారు. సంఘటనా స్థలంలో 53 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రజా మంత్రిత్వ శాఖ దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆస్పత్రికి తీసుకువెళ్లిన గాయపడిన ఇద్దరు ప్రయాణికులు కూడా మరణించారని శాన్ జువాన్ డి డియోస్ ఆసుపత్రి ధృవీకరించింది.

అగ్నిమాపక శాఖ ప్రతినిధి ఎడ్విన్ విల్లాగ్రాన్ మాట్లాడుతూ.. తెల్లవారుజామున బహుళ వాహనాలు ఢీకొనడంతో బస్సు రోడ్డుపై నుంచి వంతెన కింద ఉన్న నిటారుగా ఉన్న లోయలోకి పడిపోయిందని, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. ఆ బస్సు 115 అడుగుల (35 మీటర్లు) ఎత్తులో మురుగునీటితో కలుషితమైన ప్రవాహంలో పడిపోయింది.

అది తలక్రిందులుగా పడి సగం మునిగిపోయింది. బస్సు రాజధానికి ఈశాన్యంలోని ప్రోగ్రెసో నుండి వచ్చింది. బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారని స్వచ్ఛంద అగ్నిమాపక ప్రతినిధి ఆస్కార్ సాంచెజ్ తెలిపారు. అధ్యక్షుడు బెర్నార్డో అరేవాలో తన సంతాపాన్ని తెలియజేసి, జాతీయ సంతాప దినాన్ని ప్రకటించారు.

Next Story