మరోసారి ఆత్మాహుతి దాడి, ముగ్గురు కమాండోలు మృతి

పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంలో జరిగిన జంట ఆత్మాహుతి బాంబు దాడుల్లో ముగ్గురు పాకిస్తాన్ కమాండోలు మృతి చెందారు.

By -  Knakam Karthik
Published on : 24 Nov 2025 12:05 PM IST

International News, Pakisthan, suicide bombing, Pakistani commandos killed

మరోసారి ఆత్మాహుతి దాడి, ముగ్గురు కమాండోలు మృతి

పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంలో జరిగిన జంట ఆత్మాహుతి బాంబు దాడుల్లో ముగ్గురు పాకిస్తాన్ కమాండోలు మృతి చెందారు. నగరంలోని ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్‌సీ) పారామిలటరీ దళాల ప్రధాన కార్యాలయంపై సోమవారం సాయుధులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారని రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం ఎఫ్‌సీ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో మొదట రెండు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత కాల్పుల మోత మొదలైంది. ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు ఈ దాడికి పాల్పడినట్లు ఓ సీనియర్ అధికారి రాయిటర్స్‌కు తెలిపారు. ఒక ఉగ్రవాది ప్రధాన ద్వారం వద్ద తనను తాను పేల్చుకోగా, మరొకరు కాంపౌండ్‌లోకి ప్రవేశించి దాడి చేసినట్లు ఆయన వివరించారు.

దాడి సమాచారం అందిన వెంటనే పాకిస్థాన్ సైన్యం, పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. హెడ్ క్వార్టర్స్ వెలుపల రహదారిని మూసివేసి, మొత్తం ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయం లోపల మరికొందరు ఉగ్రవాదులు ఉండవచ్చనే అనుమానంతో భద్రతా దళాలు జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ దాడితో పెషావర్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది

Next Story