భారత్‌లో కరోనా విలయతాండవం.. 24గంట్లలో 18,522 పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2020 4:48 AM GMT
భారత్‌లో కరోనా విలయతాండవం.. 24గంట్లలో 18,522 పాజిటివ్‌ కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలో 15వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,522 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 418 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు 5,66,840 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం నమోదు అయిన కేసుల్లో 3,34,822 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 2,15,125 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 16,893 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 86,08,654 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,10,292 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.

దేశంలో అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు 1,69.883 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 7,610 మృత్యువాత పడ్డారు. ఇక ఢిల్లీలో 85,161 కేసులు నమోదు ఆకగా.. 2680 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా కంటైన్‌మెంట్ల జోన్లలో జూలై31 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Next Story