భార‌త్‌లో 24గంట‌ల్లో 3561 కేసులు.. 89 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 May 2020 5:36 AM GMT
భార‌త్‌లో 24గంట‌ల్లో 3561 కేసులు.. 89 మంది మృతి

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గ‌డిచిన మూడు రోజుల్లోనే 10వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 3561 పాటిజివ్ కేసులు న‌మోదుకాగా.. 89 మంది మ‌ర‌ణించార‌ని కేంద్ర‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. వీటితో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952కి చేరింది. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 1,783 మంది మృత్యువాత ప‌డ్డారు. మొత్తం న‌మోదైన కేసుల్లో 15,267 కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కాగా.. 35,902 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక మ‌హారాష్ట్ర‌లో అత్మ‌ధిక కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హారాష్ట్ర‌లో 16,578 కేసులు న‌మోదు కాగా 651 మంది మృత్యువాత‌ప‌డ్డారు. త‌మిళ‌నాడులో 4829 కేసులు న‌మోదు కాగా.. 35 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజ‌రాత్‌లో 6,625 కేసులు న‌మోదు కాగా.. 396మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లిలో 5532 కేసులు న‌మోదు కాగా.. 65 మంది మ‌ర‌ణించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 3138 కేసులు న‌మోదు కాగా.. 185 మంది మృత్యువాత‌ప‌డ్డారు. తెలంగాణ‌లో 1107 కేసులు న‌మోదు కాగా.. 29 మంది చ‌నిపోయారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 1777 కేసులు న‌మోదు కాగా.. 36 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story