భార‌త్‌లో 50వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2020 4:58 AM GMT
భార‌త్‌లో 50వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

భార‌త్‌లో కోరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 2,958 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. 126 మంది మ‌ర‌ణించార‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49,391కి చేరింది. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కు 1694 మంది మృతి చెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన కేసుల్లో 14,182 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 33,514 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక దేశంలోనే అత్య‌ధిక కేసులు మ‌హారాష్ట్ర‌లో న‌మోదు అవుతున్నాయి. మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 15,525 కేసులు న‌మోదుకాగా.. 617 మంది మృత్యువాత ప‌డ్డారు. గుజ‌రాత్‌లో 6245 కేసులు న‌మోద కాగా.. 49 మంది మ‌ర‌ణించారు. ఢిల్లీలొ 5104 కేసులు న‌మోదు కాగా.. 64 మంది మృతిచెందారు. త‌మిళ‌నాడులో 4058 కేసులు న‌మోదు కాగా.. 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 3049 కేసులు న‌మోదు కాగా.. 176 మంది మృత్యువాత‌ప‌డ్డారు. ఏపీలో 1717కేసులు న‌మోదు కాగా.. 34 మంది చ‌నిపోయారు. తెలంగాణ‌లో 1096 కేసులు న‌మోదు కాగా.. 29 మంది మ‌ర‌ణించారు.

Next Story