భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. 24గంటల్లో 10,956 కేసులు 396 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2020 4:48 AM GMT
భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. 24గంటల్లో 10,956 కేసులు 396 మంది మృతి

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,956 కేసులు నమోదు కాగా.. 396 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఒక్క రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 2,97,535 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 8,498 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదైన కేసుల్లో 1,47,195 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,41,842 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 74 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 4లక్షలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన దేశాల్లో భారత్‌ 4వ స్థానానికి చేరింది. మొదటి స్థానంలో 20లక్షల కేసులతో అమెరికా ఉండగా.. ఆ తర్వాత బ్రెజిల్‌ (8లక్షలు), రష్యా (5లక్షలు) లు ఉన్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపులతో దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఇది ఇలాగే కొనసాగితే.. త్వరలోనే ఇండియా మొదటి స్థానానికి చేరుకుంటుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story