భారత్లో కరోనా ఉగ్రరూపం.. 24 గంట్లలో 8,390 పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 31 May 2020 5:07 AM GMTభారత్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8390 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 193 మృతి చెందారని కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. కరోనా మహమ్మారి భారత్లో విజృంభణ మొదలైన తరువాత ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,82,143 కి చేరింది.
ఇప్పటి వరకు ఈ మహమ్మారి భారీన పడి 5,164 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 86,984 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 89,995 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 65వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తమిళనాడు, గుజరాత్లలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇక ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ 9వ స్థానంలో ఉండగా.. మరణాల్లో 13వ స్థానంలో ఉంది. కాగా.. దేశంలో లాక్డౌన్ 4.0 గడువు ముగియడంతో లాక్డౌన్ 5.0కి సంబంధించి తాజా మార్గదర్శకాలను ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.