భార‌తీయ వైద్య‌విద్యార్థుల‌ను ఆదుకున్న ఉజ్బెకిస్థాన్

Uzbekistan Allotment of 2 thousand MBBS seats for Indian medical students. ఉక్రెయిన్ నుంచి వైద్య విద్య మ‌ధ్య‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2023 10:07 AM GMT
భార‌తీయ వైద్య‌విద్యార్థుల‌ను ఆదుకున్న ఉజ్బెకిస్థాన్
  • ప్ర‌త్యేకంగా 2వేల ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు
  • 500 మందిని చేర్చుకున్న తాష్కెంట్ మెడిక‌ల్ అకాడ‌మీ
  • వెయ్యి మందిని చేర్చుకున్న బుఖారా స్టేట్ మెడికల్ ఇన్ స్టిట్యూట్
  • హైద‌రాబాద్‌లో టీఎంఏ ద‌క్షిణాసియా ప్రాంతీయ కార్యాల‌యం

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేప‌థ్యంలో ఉక్రెయిన్ నుంచి వైద్య విద్య మ‌ధ్య‌లో వ‌దిలిపెట్టి వ‌చ్చేసిన భార‌తీయ విద్యార్థులు ఎంబీబీఎస్ కొన‌సాగించేందుకు వీలుగా, ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ త‌మ దేశంలో 2వేల మెడిక‌ల్ సీట్ల‌ను కేటాయించింది.

ఉక్రెయిన్‌లో తమ మునుపటి చదువులను కోల్పోకుండా సరసమైన ఖర్చుతో 500 మంది మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును ఉజ్బెకిస్థాన్ ఆరోగ్యశాఖ‌ మాజీ మంత్రి, తాష్కెంట్ మెడికల్ అకాడమీ రెక్టార్ క‌లిసి.. ఎంహెచ్ఇఐ ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారతీయ ప్రతినిధి, డైరెక్టర్ నియో డాక్టర్ దివ్య రాజ్ సహాయంతో కాపాడారు. 1000 మంది విద్యార్థులను బుఖారా స్టేట్ మెడికల్ ఇన్ స్టిట్యూట్, 500 మంది విద్యార్థులను ఉజ్బెకిస్థాన్ లోని ఇతర సంస్థలు చేర్చుకున్నాయి.

టీఎంఎ, బుఖారా అనేవి.. ఆధునిక మౌలిక సదుపాయాలు, అదనపు శిక్షణ కోసం భారతీయ, అంతర్జాతీయ ప్రొఫెసర్లతో కూడిన‌ అధునాతన మల్టీ-స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి సైతం ఉన్న అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు.

పరిమిత సీట్లు, అధిక ఫీజుల కారణంగా, భారతదేశానికి చెందిన‌ మధ్యతరగతి విద్యార్థులు విదేశాలలో ఎంబీబీఎస్ చ‌దువుతారు. కానీ కొంద‌రు దళారులు విద్యార్థులను తప్పుదోవ పట్టించి, మోసం చేస్తున్నారు. దీన్ని నివారించడానికి ఉజ్బెకిస్థాన్‌కు చెందిన టీఎంఎ తన వ్యూహాత్మక భాగస్వామి నియో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ తో కలిసి హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో తమ దక్షిణాసియా ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. దీనిద్వారా.. పార‌దర్శ‌క‌మైన‌, స‌త్వ‌ర‌సేవ‌ల‌తో నేరుగా ప్ర‌వేశాల‌ను అందించ‌డం ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన‌ భారతీయ విద్యార్థుల ధైర్యాన్ని రెక్టార్ ప్రశంసించారు. సమాచారం, సేవలు నేరుగా పొంద‌డానికి హైదరాబాద్ లోని టీఎంఏ ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించాలని వారి తల్లిదండ్రులకు సూచించారు.

టీఎంఏ, ఉజ్బెకిస్థాన్ ప్రతినిధి బృందం నియో గ్రూపుతో ఆరోగ్య, ఆర్థిక మంత్రి హ‌రీష్ రావును కలిసి, ఉక్రెయిన్ యుద్ధం త‌ర్వాత‌ భారతీయ విద్యార్థులకు కేటాయించిన 2000 కోటాలో 500 మంది విద్యార్థులను టీఎంఏ, 1000 మందిని బుఖారా, మిగిలిన 500 మందిని ఇతర సంస్థలు చేర్చుకున్నాయని ఆయ‌న‌కు చెప్పారు. భార‌త‌దేశానికి చెందిన తెలుగు విద్యార్థులు, ఇత‌ర విద్యార్థుల క్షేమ స‌మాచారం గురించి అడిగిన మంత్రి.. వారిలో తెలివైన మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల పిల్ల‌ల‌కు స్కాల‌ర్‌షిప్‌లు ఇవ్వాల‌ని కోరారు. అలాగే విద్యార్థులు, వైద్యులు, చికిత్స‌ల విష‌యంలో ఉజ్బెక్-తెలంగాణ ఉమ్మడి సహకారం గురించి కూడా చర్చించారు. ఇతర దేశాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన చికిత్సను అందించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం వైద్య ప‌ర్యాట‌కానికి కూడా ప్రసిద్ధి చెందిందని మంత్రి వారికి తెలిపారు. తెలంగాణ విద్యార్థుల తరలింపులో డాక్టర్ దివ్య చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. తెలంగాణ నుంచి అల్లోపతితో పాటు ఆయుష్ చికిత్స‌ల‌నూ ఉబ్జెకిస్థాన్‌లో ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను అందించాల్సిందిగా తెలంగాణ ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు.

ఉజ్బెకిస్థాన్ రాయ‌బార కార్యాల‌యంలోని ఫ‌స్ట్ సెక్ర‌ట‌రీ మొహమ్మద్ మాట్లాడుతూ.. ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారతదేశంలో విద్యార్థుల కెరీర్ భద్రత కోసం ఎన్ఎంసి నిబంధనలను అంగీకరించిందని, విద్యార్థులకు ఎంబసీ అన్ని విధాలుగా సహాయపడుతుందని చెప్పారు. ఉజ్బెకిస్థాన్ కు భారత్ స్నేహపూర్వక దేశమని, దౌత్య‌ప‌ర‌మైన సంబంధాలు, స‌హ‌కారం విష‌యంలో 30వ వార్షికోత్స‌వం చేసుకుంద‌ని అన్నారు. 2023లో భారత్ ఎస్ సీవో అధ్యక్ష పదవిని చేపట్టిందని, ఇటీవల జీ20 దేశాలకు చైర్మన్ గా భారత్ ను నియమించారని గుర్తుచేశారు. ఇదంతా ఇక్క‌డి యువ‌శ‌క్తివ‌ల్లే సాధ్య‌మైంద‌న్నారు. రాయ‌బారి దిల్షాద్ నేతృత్వంలో రాయబార కార్యాలయం విద్యార్థులకు అన్ని విధాలుగా సహకరిస్తుందని ఆయన చెప్పారు.

ఈ క్లిష్ట సమయంలో తమ పిల్లల చదువుకు సహాయపడుతున్నందుకు తల్లిదండ్రులు... హెచ్.ఇ.అలిషర్ కయుమోవిచ్ షడ్మనోవ్, డాక్టర్ బి.దివ్య రాజ్ రెడ్డిలకు ఒక పెద్ద, కస్టమ్ కాన్వాస్ పెయింటింగ్ ఫ్రేమ్‌ బహూకరించారు.


ఉజ్బెకిస్థాన్ అంత‌ర్జాతీయ వైద్య‌కేంద్రంగా ఎదుగుతోంది. ముంబైలోని అంబానీ ఆస్ప‌త్రి, హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త‌రి అక్క‌డి మరాఫోన్ గ్రూప్ తో చేతులు కలిపి రూ.245 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశాయి. మెడికల్ టూరిజం, నిపుణులైన వైద్యుల ప‌ర‌స్ప‌ర మార్పిడి, హైరిస్క్ సర్జరీలు చేయడంలో భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

Next Story