Hyderabad: మరో 3 నెలల్లో టూరిస్ట్ ప్లేస్గా సర్దార్ మహల్
చార్మినార్ సమీపంలో ఉన్న చారిత్రక సర్దార్ మహల్ ఆర్ట్ గ్యాలరీ, హెరిటేజ్ హోటల్గా రూపాంతరం చెందుతోంది.
By అంజి Published on 2 May 2023 10:45 AM IST![Sardar Mahal, tourist center, Hyderabad Sardar Mahal, tourist center, Hyderabad](https://telugu.newsmeter.in/h-upload/2023/05/02/344876-sardar-mahals-transformation-as-tourist-center-expected-in-three-months.webp)
Hyderabad: మరో 3 నెలల్లో టూరిస్ట్ ప్లేస్గా సర్దార్ మహల్
హైదరాబాద్ : చార్మినార్ సమీపంలో ఉన్న చారిత్రక సర్దార్ మహల్ ఆర్ట్ గ్యాలరీ, హెరిటేజ్ హోటల్గా రూపాంతరం చెందుతోంది. కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ వచ్చే మూడు నెలల్లో పూర్తి కానుంది. ప్రాజెక్టు పూర్తయితే చార్మినార్, మక్కా మసీదు సందర్శకులకు సర్దార్ మహల్ పర్యాటక కేంద్రంగా ఉపయోగపడుతుంది. సర్దార్ మహల్ యొక్క బయటి భవనం ప్రస్తుతం సుందరీకరణ చేయబడుతోంది, నిర్మాణం, మరమ్మత్తు పనులు దాదాపు 60% పూర్తయ్యాయి.
1900లో నిజాం VI మీర్ మహబూబ్ అలీ ఖాన్ నిర్మించిన యూరోపియన్ తరహా ప్యాలెస్ సర్దార్ మహల్ను అదనపు నిర్మాణ పనులతో పునరుద్ధరించడానికి, సంరక్షించడానికి అధికారులు ప్రణాళికలు ప్రకటించారు. నిజాం భార్యలలో ఒకరైన సర్దార్ బేగం కోసం నిర్మించినప్పటికీ, ఆమె అంచనాలను అందుకోకపోవడంతో ఆమె ప్యాలెస్లో నివసించడానికి నిరాకరించింది. ఈ భవనం తరువాత సర్దార్ మహల్ అని పిలువబడింది. అయినప్పటికీ మహల్ ఖాళీగా ఉంది.
తరువాత దీనిని హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH) వారసత్వ భవనంగా గుర్తించింది. 1965లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఆస్తిపన్ను బకాయిల కారణంగా సర్దార్ మహల్ యాజమాన్యాన్ని తీసుకుంది. సర్దార్ మహల్ని హెరిటేజ్ హోటల్, ఆర్ట్ గ్యాలరీగా ప్రభుత్వం మార్చబోతోంది. పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు సర్దార్ మహల్లో కళాకృతి ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రణాళిక సిద్ధం చేసింది. చార్మినార్, మక్కా మసీదు, చౌమొహల్లా ప్యాలెస్, నిజామియా మెడికల్ కాలేజ్, షిఫాఖానా యునాని చార్మినార్, బాద్షాహీ అషూర్ ఖానా, అలాగే లాడ్ బజార్, పాతర్గట్టి వంటి పర్యాటక ప్రదేశాలను పర్యాటక ప్రాంతాల నెట్వర్క్గా అభివృద్ధి చేయడం లక్ష్యం.
రాజస్థాన్లోని నీమ్ రాణా ఫోర్ట్ ప్యాలెస్ తరహాలో సర్దార్ మహల్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఆ మేరకు తెలంగాణ సంస్కృతికి చెందిన కళాఖండాల నమూనాలను పరిశీలన కోసం గ్యాలరీలో ఉంచి, గ్యాలరీనే చారిత్రక మ్యూజియంగా అభివృద్ధి చేస్తారు. సర్దార్ మహల్ అభివృద్ధి పూర్తయిన తర్వాత, హైదరాబాద్లో పర్యాటకానికి గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుంది. ఈ చారిత్రాత్మక భవనం చార్మినార్ నుండి కోట్లా అలీ జా వరకు ఉన్న రహదారిలో ఉంది. పర్యాటకులు ఈ ప్రాంతంలోని అనేక ఇతర చారిత్రక కట్టడాలను సందర్శించగలరు. ఈ అభివృద్ధి ఈ భవనాలకు సందర్శకుల సంఖ్యను పెంచుతుందని, ఈ ప్రాంతంలో పర్యాటక ఆసక్తికి కేంద్రంగా మారుతుందని భావిస్తున్నారు.