హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా వాహనాలపై రూ.వేలల్లో జరిమానాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతుంటారు. జరిమానాలు వసూలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం 'దసరా పండగ' సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఈ-చలానా అందుకుని చెల్లించనవారికి అవకాశం కల్పించారని, పెండింగ్ చలానాలపై 50 శాతం డిస్కౌంట్తో చెల్లించే సౌకర్యాన్ని కల్పిస్తోందని ఆ వార్త సారాంశం. అక్టోబరు 4 నుంచి 7 వరకు గోషామహల్ స్టేడియంలో నిర్వహించే 'ప్రత్యేక లోక్ అదాలత్' ద్వారా ఇలా చలాన్ల మొత్తాలను చెల్లించవచ్చని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారని పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ట్రాఫిక్ చలాన్లపై హైదరాబాద్ పోలీసులు 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో ఈ వైరల్ పోస్టులో ఎటువంటి నిజం లేదని తేల్చేశారు. ఇలా తప్పుడు పోస్టులను షేర్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
"HYDTPinfo We noticed a message is going viral in SM informing that there will be Tr Lokadalath from 4-7th Oct. @HYDTP inform all the citizens that msg is Fake, don't believe and not to spread. Legal action will be initiated against those who post or forward the below fake msg," అంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ట్వీట్ వెలువడింది.
#HYDTPinfo We noticed a message is going viral in SM informing that there will be Tr Lokadalath from 4-7th Oct. @HYDTP inform all the citizens that msg is Fake, don't believe and not to spread. Legal action will be initiated against those who post or forward the below fake msg. pic.twitter.com/8Jvzjo7x9T
అప్పట్లో పెండింగ్ చలాన్ లను వసూలు చేయడానికి 2016 లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మెగా అదాలత్ ను నిర్వహించారు.
రాబోయే రోజుల్లో ట్రాఫిక్ చలాన్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ పోస్టును షేర్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
Claim Review:ట్రాఫిక్ చలాన్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారా..?