యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
ప్రముఖ తెలుగు యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By అంజి
యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
ప్రముఖ తెలుగు యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సూసైడ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణ చంద్ర నాయక్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి11 గంటల సమయంలో తన అడ్వకేట్తో కలిసి పూర్ణ చందర్ చిక్కడపల్లి పోలీస్స్టేషన్కు వెళ్లాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పూర్ణ చంద్ర నాయక్ను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గత కొన్నాళ్ల నుంచి స్వేచ్ఛ, పూర్ణ చంద్ర సహజీవనం చేశారు. అయితే స్వేచ్ఛను వివాహం చేసుకోకుండానే వేధింపులకు గురిచేశాడని పూర్ణపై ఆరోపణలు ఉన్నాయి. పూర్ణ వేధింపులు భరించలేకనే స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పూర్ణను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై లైంగిక దాడి కేసు నమోదు చేశారు. ఆమెను పెళ్లి పేరుతో నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని పూర్ణపై ఆరోపణలు ఉన్నాయి. పూర్ణ పై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 69, 108 కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం (జూన్ 27) రాత్రి జవహర్ నగర్లోని తన నివాసంలో స్వేచ్ఛ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.