రాజేంద్రనగర్‌లో కలకలం..ప్రాక్టికల్స్ సరిగ్గా రాయలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గురువారం ఒక కలకలం రేపే ఘటన జరిగింది.

By -  Knakam Karthik
Published on : 19 Feb 2026 7:32 PM IST

Hyderabad News,  Rajendranagar, Inter Student, Exam Fear, Student Suicide Attempt

రాజేంద్రనగర్‌లో కలకలం..ప్రాక్టికల్స్ సరిగ్గా రాయలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గురువారం ఒక కలకలం రేపే ఘటన జరిగింది. పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

భవాని కాలనీలోని ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం (BiPC) చదువుతున్న రితిక అనే విద్యార్థిని. ఇటీవల జరిగిన బైపీసీ ప్రాక్టికల్ పరీక్షలు సరిగ్గా రాయలేకపోయాననే మనస్తాపంతో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భవనం పైనుంచి దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాక్టికల్స్ ఆందోళనే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, ఇతర కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో విద్యార్థుల్లో పెరుగుతున్న పరీక్షల ఒత్తిడి మరియు మానసిక ఆరోగ్య పరిరక్షణపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story