Hyderabad: వీఎస్‌టీ - ఇందిరాపార్క్‌ స్టీల్‌ ఫ్లైఓవర్‌ త్వరలో ప్రారంభం

హైదరాబాద్‌లో తొలిసారిగా ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్‌టీ వరకు స్టీల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

By అంజి
Published on : 15 Aug 2023 11:26 AM IST

Indira Park VST, steel flyover, Hyderabad

Hyderabad: వీఎస్‌టీ - ఇందిరాపార్క్‌ స్టీల్‌ ఫ్లైఓవర్‌ త్వరలో ప్రారంభం

హైదరాబాద్‌లో తొలిసారిగా ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్‌టీ వరకు స్టీల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఫ్లైఓవర్ లోడ్ పరీక్షలో ఉంది. ఇది మరో 10 రోజుల్లో ప్రజలకు తెరవబడుతుంది. ఎన్టీఆర్ స్టేడియం జంక్షన్, అశోక్‌నగర్ జంక్షన్, ఆర్టీసీ ఎక్స్‌ రోడ్స్ జంక్షన్, బాగ్ లింగంపల్లి జంక్షన్ - కనీసం నాలుగు జంక్షన్‌లను తప్పించి ఇందిరా పార్క్ నుండి విద్యానగర్ జంక్షన్ వరకు ఈ ఫ్లైఓవర్ సిగ్నల్‌ రహిత ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ జంక్షన్ వద్ద, ఫ్లైఓవర్ మెట్రో లైన్-II నుండి 26.54 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

తెలంగాణ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌డిపి) కింద జిహెచ్‌ఎంసి 450 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించింది. ప్రత్యేకమైన 2.81 కి.మీ పొడవు ఉక్కు ఫ్లైఓవర్ 12,500 మెట్రిక్‌ టన్నుల ప్రత్యేక అల్లాయ్ స్టీల్, 20,000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ ఉపయోగించి నిర్మించబడింది. ఫ్లైఓవర్ 81 ఉక్కు స్తంభాలపై ఉంది. వీటిలో 46 పిల్లరు పునాదులు సహా స్టీల్‌వే కాగా, మిగిలినవి బహిరంగ త్రవ్వకాల పునాదులు. మొత్తంగా, 426 స్టీల్ గిర్డర్‌లు 16.6 మీటర్ల వెడల్పు గల నాలుగు లేన్‌ల డెక్ స్లాబ్‌కు సపోర్ట్‌ని ఇస్తాయి.

ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర ఫ్లైఓవర్‌ను 26.54 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇక్కడ మైట్రో రైలు వంతన మీదగా నిర్మించడం స్టీల్ బ్రిడ్జి ప్రత్యేకత. స్టీల్ బ్రిడ్జి ప్లైఓవర్ పనులన్ని పూర్తి కావడంతో ప్రస్తుతం దీనిపై లోడ్ టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. 10 రోజులపాటు ఈ పరీక్ష అనంతరం దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ బ్రిడ్జికి 2020 జూలై 11వ తేదీన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదగా శంకుస్థాపన చేయగా సరిగ్గా మూడేళ్ల కాలంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూరైంది.

Next Story