Hyderabad: గంగమ్మ ఒడికి చేరుకుంటున్న గణేష్లు.. ఇప్పటి వరకు 2.61 విగ్రహాల నిమజ్జనం
11 రోజుల పాటు జరిగిన వినాయక చవితి ఉత్సవాల ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఇవాళ కూడా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్..
By అంజి
Hyderabad: కొనసాగుతున్న గణేష్ విగ్రహాల నిమజ్జనం
హైదరాబాద్: 11 రోజుల పాటు జరిగిన వినాయక చవితి ఉత్సవాల ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఇవాళ కూడా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్, ఇతర ప్రాంతాల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. శనివారం నిమజ్జనానికి చివరి రోజు అయినప్పటికీ, కొంతమంది నిర్వాహకులు ఊరేగింపును ఆలస్యంగా ప్రారంభించడంతో అది ఆదివారం వరకు కొనసాగింది. ఆదివారం సాయంత్రం నాటికి నిమజ్జన ప్రక్రియ ముగియవచ్చని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో 2.61 లక్షలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ సరస్సులో 11000 గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. పండుగ ప్రారంభం నుంచి జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు 11,000 టన్నుల చెత్తను తొలగించి జవహర్ నగర్ డంప్ యార్డ్లో వేశారని ప్రకటనలో తెలిపారు. ఆది, సోమవారాల్లో నగరంలో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. శనివారం హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలలోని నీటి వనరులలో వివిధ ఆకారాలు, పరిమాణాలలో వేలాది గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిమజ్జన ప్రక్రియ చాలా రోజుల క్రితమే ప్రారంభమైనప్పటికీ, పూజ కోసం ఏర్పాటు చేసిన చాలా విగ్రహాలను శనివారం నిమజ్జనం చేశారు. శనివారం ఉదయం నుంచే నగరంలోని హుస్సేన్ సాగర్ సరస్సు, దాని చుట్టూ ఉన్న రోడ్లు పండుగ వాతావరణంతో కళకళలాడాయి, వేలాది మంది భక్తులు 'గణపతి బప్పా మోర్యా' నినాదాలతో వచ్చారు.
హైదరాబాద్లోని గణేష్ చతుర్థి ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణ అయిన ఖైరతాబాద్ నుండి 69 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహం, నగరంలోని ప్రసిద్ధ బాలాపూర్ గణేష్ను శనివారం హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేశారు. నిమజ్జన చివరి రోజున ఊరేగింపులు సజావుగా సాగేందుకు ప్రభుత్వం భద్రతతో సహా విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 27న తెలంగాణ అంతటా భక్తి శ్రద్ధలతో, ఆనందంతో గణేష్ చతుర్థి వేడుకలు ప్రారంభమయ్యాయి.