హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లు : ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్
Hyderabad Police to use drones for traffic management JT CP Ranganath.హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ను నియంత్రించేందుకు డ్రోన్లను ఉపయోగించాలని
By తోట వంశీ కుమార్ Published on 7 April 2022 8:37 AM IST
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ను నియంత్రించేందుకు డ్రోన్లను ఉపయోగించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఈ విషయంపై హైదరాబాద్ జాయింట్ ట్రాఫిక్ కమిషనర్ ఏవీ రంగనాథ్ న్యూస్మీటర్తో మాట్లాడుతూ.. 'ట్రాఫిక్ రద్దీగా ఉన్న ప్రాంతాలను గుర్తించడానికి డ్రోన్లు మాకు సహాయపడతాయి. మా పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్ను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తారు' అని ఆయన వివరించారు. మార్కెట్లో అత్యుత్తమ డ్రోన్ల కోసం డిపార్ట్మెంట్ వెతుకుతోందని తెలిపారు.
డ్రోన్ల సాయంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తారు అని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఎవరైనా నో పార్కింగ్ జోన్లో పార్కింగ్ చేసినా.. ఇతర సమస్యలను పర్యవేక్షించడానికి డ్రోన్లు సహయపడతాయని చెప్పారు. ఇక డ్రోన్లను కమాండ్ సెంటర్ నుంచి నియంత్రించనున్నట్లు తెలిపారు.ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే.. వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.
'ప్రధాన రహదారులు మరియు ప్రధాన జంక్షన్లలో పోలీసులను ఉంచారు. చాలా రద్దీగా ఉండే రోడ్లు ఉన్నాయి, అక్కడ పోలీసులు కనిపించరు. చాలా మంది వ్యక్తులు అక్రమంగా పార్కింగ్ చేయడం మరియు హెల్మెట్ ధరించడం లేదని మేము గమనించాము. అటువంటి ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా.. మేము దృష్టి పెడతాము. మేము వాటిని పర్యవేక్షిస్తామని' రంగనాథ్ తెలిపారు.
'ఒక నెలలో దాదాపు డజను డ్రోన్లు సేవలందించబడతాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఓవర్ స్పీడ్ కు చెక్ పెట్టేందుకు మరిన్ని స్పీడ్ గన్ లను కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం, డిపార్ట్మెంట్ అరడజన్కు పైగా స్పీడ్ గన్లను కలిగి ఉంది మరియు మరో డజను కొనుగోలు చేయడానికి యోచిస్తోంద'న్నారు.
రెండు వారాల క్రితం.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పాత పాడుబడిన వాహనాలను లాగడం ప్రారంభించారు. 2500 వాహనాలకు నోటీసులు జారీ చేశారు. అందులో ఇప్పటి వరకు 1000 వాహనాలు తరలించబడ్డాయని తెలిపారు.
ఇదిలా ఉండగా.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జైలు శిక్ష విధించే నిబంధనలను పోలీసులు అమలు చేస్తారని రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్లో మార్చి 2022 నాటికి దాదాపు 7, 000 పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులు 2014 నుండి పేరుకుపోతున్నాయి. మహమ్మారి ముగిసినందున, మేము విచారణను తిరిగి ప్రారంభించాలని మరియు డ్రంకెన్ డ్రైవింగ్ కేసులలో జైలు శిక్షలు విధించాలని చట్టపరమైన అధికారులకు లేఖ రాశాము. మేము దానిపై కఠినంగా అమలు చేస్తాము అని రంగనాథ్ తెలిపారు.
మోటారు వాహనాల చట్టం ప్రకారం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం మొదటి నేరానికి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 2, 000. లేదా రెండూ. ముఖ్యంగా అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం తాగి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తరచూ తనిఖీలు చేయడం ప్రారంభించారని రంగనాథ్ తెలిపారు.