Hyderabad: హాస్టల్‌ కోసం.. నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళన

అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థినులకు హాస్టల్ గదులను అధికారులు 100 శాతం కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిజాం కళాశాల విద్యార్థులు ఆగస్టు 5 సోమవారం బషీర్ బాగ్‌లో నిరసన చేపట్టారు.

By అంజి  Published on  5 Aug 2024 9:50 AM GMT
Hyderabad, Nizam College, students protest, 100 pc hostel allotment, UG girls

Hyderabad: హాస్టల్‌ కోసం.. నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్: అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థినులకు హాస్టల్ గదులను అధికారులు 100 శాతం కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిజాం కళాశాల విద్యార్థులు ఆగస్టు 5 సోమవారం బషీర్ బాగ్‌లో నిరసన చేపట్టారు. నిరసన కారణంగా లిబర్టీ నుంచి అబిడ్స్ వరకు స్వల్పంగా ట్రాఫిక్ జామ్ అయింది. నిజాం కళాశాలకు 135 ఏళ్ల చరిత్ర ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ (పిజి), అండర్ గ్రాడ్యుయేట్ (యుజి) బాలికల మధ్య హాస్టల్ కేటాయింపులను విభజించాలనే ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో కొనసాగుతున్న నిరసన తీవ్రమైంది.

ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. “ప్రభుత్వం మాకు (యుజి బాలికలకు) 100 శాతం హాస్టల్ కేటాయింపును అందించే వరకు మా ఆందోళన కొనసాగుతుంది. మా డిమాండ్‌ను పూర్తిగా తీర్చే వరకు రాజీపడబోం’’ అని యూజీ విద్యార్థి ఒకరు తెలిపారు.

నిరసనకారుల ప్రకారం.. 2022లో, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు తక్కువ అడ్మిషన్లు జరిగాయి. ఈ కారణంగా కళాశాల యాజమాన్యం పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాలను అందించింది. అయితే, ఈ సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, విద్యార్థులు హాస్టల్ గదిని పొందలేకపోయారు. నగరంలో ప్రైవేట్ హాస్టళ్ల ఉండాలంటే.. ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ఆర్థిక స్థోమత లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

చాలా మంది విద్యార్థులు ప్రస్తుత అలాట్‌మెంట్ విధానం వల్ల తాము ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేశారు, దీని వల్ల చాలా మంది ప్రైవేట్ హాస్టళ్లలో ఉండాల్సి వస్తుంది. "ప్రైవేట్ హాస్టళ్లలో ఖర్చులు నిర్వహించడం మాకు కష్టంగా ఉంది" అని ఒక విద్యార్థి వ్యాఖ్యానించారు. ఈ సమస్యపై విద్యార్థులు ఆందోళన చేయడం ఇదే మొదటిసారి కాదు. డిమాండ్ యొక్క దీర్ఘకాలిక స్వభావాన్ని ప్రతిబింబిస్తూ మునుపటి సంవత్సరాలలో ఇలాంటి నిరసనలు జరిగాయి.

Next Story