Hyderabad: నెహ్రూ జూపార్క్‌కు భారీగా సందర్శకుల తాకిడి.. ఇవాళ ఒక్క రోజే 30 వేల మంది విజిట్‌

వేసవి సెలవులు మరికొద్ది రోజుల్లో ముగియనున్నాయి. దీంతో పర్యాటక స్థలాలకు, జూపార్క్‌లకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది.

By అంజి  Published on  26 May 2024 2:30 PM GMT
Hyderabad, Nehru Zoological Park, visitors,  summer vacation

Hyderabad: నెహ్రూ జూపార్క్‌కు భారీగా సందర్శకుల తాకిడి.. ఇవాళ ఒక్క రోజే 30 వేల మంది విజిట్‌

హైదరాబాద్: వేసవి సెలవులు మరికొద్ది రోజుల్లో ముగియనున్నాయి. దీంతో పర్యాటక స్థలాలకు, జూపార్క్‌లకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. సమ్మర్‌లో ఇదే చివరి ఆదివారం కావడంతో హైదరాబాదీలు పర్యాటక ప్రాంతాలకు పోటెత్తారు. నగరంలోని బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు మే 26 ఆదివారం నాడు 30,361 మంది సందర్శకులు వచ్చారు. సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా.. జూ యాజమాన్యం అదనపు బుకింగ్ కౌంటర్లను తెరిచింది. దాని వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సిస్టమ్ గురించి సమాచారాన్ని అందించింది. అదనపు భద్రతను మోహరించారు.

కార్యకలాపాలు సజావుగా జరిగేలా సిబ్బందిని కీలక పాయింట్ల వద్ద ఉంచారు. తాగునీటి యూనిట్లు, షెల్టర్లు, మొబైల్ పెట్రోలింగ్ బృందాలు, సమర్థవంతమైన నిర్వహణ కోసం నిర్దిష్ట పాయింట్ల వద్ద సిబ్బందిని ఉంచారు. మే 19న, జంతుప్రదర్శనశాలకు 25,000 మంది సందర్శకులు వచ్చారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ డిప్యూటీ క్యూరేటర్ ఎ నాగమణి జూని తమ ఆదివారం పర్యటనగా ఎంచుకున్నందుకు సందర్శకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అటు గోల్కొండ, చార్మినార్‌, సెక్రటేరియట్‌, ట్యాంక్‌ బండ్‌ పరిసరాలు పర్యాటకులతో కళకళలాడాయి.

Next Story