హైదరాబాద్: మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ కింద పడి 1వ తరగతి బాలుడు మృతి చెందాడు. కళ్లముందే తన కొడుకు శరీరం లారీ కింద పడి చిధ్రం కావడంతో ఆ కన్న తల్లి తల్లడిల్లిపోయింది. ఈ ఘటన అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఓ తల్లి తని కొడకుతో స్కూటీపై వెళ్తుండగా... టిప్పర్ ఢీకొట్టింది. బాలుడి తలపైనుంచి టిప్పర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
క్షణకాలంలో జరిగిన ప్రమాదంలో తల్లి తన కుమారుడిని కోల్పోయింది. బాలుడి మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటనతో కొంత సమయం వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.