Hyderabad: సందడిగా గోల్కొండ బోనాల జాతర

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గోల్కొండ బోనాల జాతర ఘనంగా జరుగుతోంది.

By అంజి
Published on : 29 Jun 2025 1:07 PM IST

Hyderabad, Devotees, Golconda Bonala fair

Hyderabad: సందడిగా గోల్కొండ బోనాల జాతర

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గోల్కొండ బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. చారిత్రక గోల్కొండ కోటలో తెల్లవారుజాము నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జగదాంబికా అమ్మకు రెండో పూజ నేపథ్యంలో గోల్కొండ కోటలో భక్తుల రద్దీ పెరిగింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గోల్కొండకు చేరుకుని అమ్మవారికి సమర్పించడానికి బోనాలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు దేవాలయ చూర్మన్‌ చంటిబాబు స్పష్టం చేశారు.

ఈ నెల 26వ తేదీన గోల్కొండ శ్రీజగదాంబ అమ్మవారికి మొదటి బంగారు బోనం సమర్పించడంతో ప్రారంభమైన ఉత్సవాలు జులై 24న ముగుస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లోని గ్రామ దేవతలు, అమ్మవార్లకు బోనం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు వాయిద్యాలు, గజ్జెల సవ్వళ్లు, పోతురాజులు, శివసత్తుల విన్యాసాలు, భక్తుల పూనకాలు, పొర్లు దండాలతో రాష్ట్రం సందడిగా మారింది. తెలంగాణలో బోనాలు వెయ్యేళ్ల కిందటి నుంచి కొనసాగుతున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు.

కాకతీయ రాజుల కాలంలో ప్రతాప రుద్రుడు గోల్కొండ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో పూజలు చేశారని ప్రతీతి. 600 ఏళ్ల కిందట శ్రీకృష్ణదేవరాయలు ఏడుకోళ్ల నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించారని చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే 1676లో సర్వాయి పాపన్న కరీంనగర్‌లో ఎల్లమ్మ గుడిని కట్టించి బోనాలు సమర్పించారని నానడి. కులీకుతుబ్‌షా, బాదుషా, తానీషా పాలనలోనూ గోల్కొండ, హైదరాబాద్‌ ప్రాంతాల్లో బోనాలు వైభవంగా జరిగేవి.

Next Story