ఢిల్లీ లిక్కర్‌ స్కాం: హైదరాబాద్‌ వ్యాపారవేత్త అభిషేక్‌రావు అరెస్ట్‌

Hyderabad businessman bowenpally abhishek rao arrested by cbi in delhi liquor policy scam. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావుని సీబీఐ అరెస్టు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2022 6:19 AM GMT
ఢిల్లీ లిక్కర్‌ స్కాం: హైదరాబాద్‌ వ్యాపారవేత్త అభిషేక్‌రావు అరెస్ట్‌

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావుని సీబీఐ అరెస్టు చేసింది. లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్ తర్వాత అభిషేక్ అరెస్ట్ అయ్యారు. అభిషేక్ రావుని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తూ ఉన్నారు. అభిషేక్ రావుకి 9 కంపెనీలతో సంబంధం వుంది.కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం తొమ్మిది కంపెనీల్లో అభిషేక్ రావు వాటాలు కలిగి వున్నాడు. ఆ 9 కంపెనీల్లో వివిధ రకాల వ్యాపారాలు వున్నాయి. రియల్ ఎస్టేట్, మైనింగ్ క్వారీయింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్స్ మరియు కెమికల్ ప్రొడక్స్ట్, కంప్యూటర్ రిలేటెడ్ సర్వీసులు వున్నాయి. లిక్కర్ స్కాంలో ఈడీ రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా 25 చోట్ల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అభిషేక్ రావు డైరెక్టర్ గా వున్న రాబిన్ డిస్టిలరీస్ కార్యాలయం అనూస్ బ్యూటీ పార్లర్ లో ఏర్పాటుచేశారు. దీనిపై సీబీఐ విచారణ మొదలుపెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా భావించే రామచంద్రన్ పిళ్ళైతో కలిసి అభిషేక్ రావు వ్యాపారాలు చేస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌కు సంబంధించి బోయిన్‌పల్లి అభిషేక్‌రావును సీబీఐ ఆదివారం విచారణకు పిలిచింది. ఆదివారం సాయంత్రం అతడిని అరెస్టు చేశారు. సీబీఐ దర్యాప్తులో రావు-సౌత్ లాబీగా వ్యవహరిస్తున్నారని, కార్టలైజేషన్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐకి చెందిన ఒక మూలం న్యూస్‌మీటర్‌కు తెలిపింది. సీబీఐ ఒక ప్రకటనలో, "ఢిల్లీకి చెందిన జిఎన్‌సిటిడి ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవకతవకలకు సంబంధించిన కేసు విచారణలో అభిషేక్ బోయిన్‌పల్లిని సిబిఐ అరెస్టు చేసింది. అరెస్టయిన నిందితులను కాంపిటెంట్ కోర్టు ముందు హాజరుపరుస్తారు.. విచారణ కొనసాగుతోంది. " అని తెలిపింది.

బోయిన్ పల్లి అభిషేక్ రావు (Boinpally Abhishek Rao) డైరెక్టర్ గా ఉన్న 9 కంపెనీలు ఇవే

Agasti Ventures, SS Mines & Minerals, Master Sand LLP, Neoverse Realty Pvt ltd, Anoos Electrolysis & obesity, Valuecare Esthetics Pvt ltd, Zeus Networking pvt ltd, Robin Distribution LLP, Anoos Health & Wellness Pvt ltd.

అరుణ్ రామచంద్ర పిళ్లైకి పలు కంపెనీల్లో కో-డైరెక్టర్‌లలో అభిషేక్ రావు ఒకరు. సీబీఐ కేసు నమోదు చేసిన నిందితుల్లో అరుణ్ ఒకడు కావడం గమనార్హం. హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు మూడు సార్లు సోదాలు నిర్వహించిన తర్వాత అతని అరెస్టు జరిగింది. అభిషేక్ టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఒక ఎమ్మెల్సీకి అత్యంత సన్నిహితుడు.

ఏది సీబీఐ దాడులకు దారి తీసింది?

2021-22 సంవత్సరాలకు గాను నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (GNCTD) ప్రభుత్వం.. ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని MHA డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ సీబీఐని కోరడంతో ఇదంతా ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అర్వ గోపీ కృష్ణ, అప్పటి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీ, అసిస్టెంట్ కమిషనర్ (ఎక్సైజ్) పంకజ్ భట్నాగర్‌పై ఎక్సైజ్ పాలసీ 2021-22కి సంబంధించిన నిర్ణయాలను సిఫారసు చేయడంలో, తీసుకోవడంలో అధికారులు కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వచ్చాయి. మద్యం లైసెన్సు టెండర్‌స్ లో ఎన్నో అవకతవకలు జరిగాయని సీబీఐ పేర్కొంది.

ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలకు హైదరాబాద్‌కు సంబంధం ఏమిటి?

అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు నిధులను మళ్లించే ఉద్దేశంతో ఎల్-1 లైసెన్స్ హోల్డర్లు రిటైల్ విక్రేతలకు క్రెడిట్ నోట్లు (బిల్లులు) జారీ చేసినట్లు సీబీఐకి సమాచారం అందింది. వారి రికార్డును నేరుగా ఉంచడానికి ఖాతాల పుస్తకంలో 'తప్పుడు ఎంట్రీలు' గా నమోదు చేయబడ్డాయని సీబీఐ ఆరోపించింది. బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరా, ఢిల్లీకి చెందిన దినేష్ అరోరా, అర్జున్ పాండే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సన్నిహితులని తెలిసింది. ఈ ముగ్గురూ మద్యం లైసెన్సుదారుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వోద్యోగులకు డబ్బు మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి.

మరో నిందితుడు ఇండో స్పిరిట్స్ ఎండీ సమీర్ మహేంద్రు కోటి రూపాయలు దినేష్ అరోరా నిర్వహిస్తున్న రాధా ఇండస్ట్రీస్ ఖాతాకు పంపించాడని తెలుస్తోంది. సమీర్ ను హైదరాబాద్ లో అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని కోకాపేట్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై, విజయ్ నాయర్ ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వోద్యోగికి ఇండో స్పిరిట్‌కు చెందిన సమీర్ మహేంద్రు నుండి అనవసరమైన డబ్బు చేర్చాడని సిబిఐ విచారణలో వెల్లడైంది.

Next Story