Hyderabad: మార్నింగ్‌ వాకర్స్‌పైకి దూసుకెళ్లిన కారు.. తల్లీకూతురు సహా ముగ్గురు మృతి

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదర్‌షా కోటే ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది.

By అంజి  Published on  4 July 2023 3:56 AM GMT
Hyderabad, Hyder Shah Kote, car accident, Over speeding car

Hyderabad: మార్నింగ్‌ వాకర్స్‌పైకి దూసుకెళ్లిన కారు.. తల్లీకూతురు సహా ముగ్గురు మృతి

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదర్‌షా కోటే ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. బండ్లగూడ జాగీరు సన్‌సిటీ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో తల్లీకూతురితో సహా ముగ్గురు మృతి చెందారు. కారు అతివేగంగా రావడంతో అదుపు చేయలేక ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. దీని ప్రభావం చాలా బలంగా ఉంది.

బాధితులు సమీపంలోని ముళ్ల పొదల్లోకి విసిరివేయబడ్డారు. దీంతో ఓ తల్లి, బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. బాధితులు శాంతి నగర్ కాలనీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారు ప్రతిరోజూ మార్నింగ్ వాక్‌కు వెళతారు. నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియోలో ఓ కారు పొదల్లోకి దూసుకెళ్లింది. కారు ముందు గ్లాస్ పగిలినట్లుగా ఉంది మరియు వాహనం లోపల స్పోర్ట్స్ బ్యాగ్ కనిపిస్తుంది.

Next Story