విశ్రాంత న్యాయమూర్తికి కేటుగాళ్లు టోకరా.. ఏకంగా రూ.2.5 కోట్ల మోసం

రాజకీయ పార్టీకి బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మాయమాటలు చెప్పి, నమ్మించి కోట్లల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు కేటుగాళ్లు.

By అంజి  Published on  28 Feb 2024 5:34 AM GMT
Former HighCourt Judge,scamsters, electoral bonds, Hyderabad

విశ్రాంత న్యాయమూర్తికి కేటుగాళ్లు టోకరా.. ఏకంగా రూ.2.5 కోట్ల మోసం

హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి విరాళాల పేరుతో మోసాలకు తెరలేపారు కేటుగాళ్లు. రాజకీయ పార్టీకి బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మాయమాటలు చెప్పి, నమ్మించి కోట్లల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ఈ కేటుగాళ్ల వలలో ఓ న్యాయవాది కుటుంబం చిక్కుకొని గిలగిలా కొట్టుకుంది. నరేంద్ర, కసిరెడ్డి శరత్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డీ ఎస్ ఆర్ వర్మ కుటుంబం వద్ద నుంచి ఏకంగా రెండున్నర కోట్లు రూపాయలను వసూలు చేశారు. రెండేళ్లు గడిచినా కూడా బాండ్లకు సంబంధించిన ఎలాంటి రశీదులు కేటుగాళ్ళు ఇవ్వలేదు.

బాండ్ల పేరుతో విరాళాలు చట్ట విరుద్దం అంటూ ఇటీవల సుప్రీం కోర్టులో తీర్పు వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తం అయిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వర్మ రెండున్నర కోట్లు గురించి వాకబు చేసాడు. సదరు వ్యక్తులు పార్టీకి డబ్బులు చెల్లించకుండా సొంతానికి వాడుకున్నారని తెలియడంతో జస్టిస్ కంగుతిన్నాడు. అనంతరం జస్టిస్ వర్మ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నరేంద్ర, కసిరెడ్డి శరత్ రెడ్డి లపై ఐపీసీ 406, 420 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

Next Story