హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు యూసుఫ్గూడ నుంచి భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. అటు బీజేపీ నుంచి లంకల దీపక్రెడ్డి పోటీ పడుతున్నారు.