'నీ అంతు చూస్తా'.. మల్కాజిగిరి ఎమ్మెల్యే బెదిరింపులు.. కేసు నమోదు

అల్వాల్‌ డిప్యూటీ కమిషనర్‌ను బెదిరించినందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, అతని మద్దతుదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

By అంజి  Published on  8 March 2024 3:20 AM GMT
Malkajigiri, MLA Marri Rajasekhar Reddy, Alwal DC, Hyderabad

'నీ అంతు చూస్తా'.. మల్కాజిగిరి ఎమ్మెల్యే బెదిరింపులు.. కేసు నమోదు

హైదరాబాద్: అల్వాల్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి ఉద్యోగులను రానీయకుండా, డిప్యూటీ కమిషనర్‌ను బెదిరించినందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, అతని మద్దతుదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్‌ఎంసీ అల్వాల్‌ సర్కిల్‌ కార్యాలయం వద్ద ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు ప్రయత్నించారు.

అల్వాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు కార్యాలయానికి వచ్చి ప్రధాన తలుపులు మూసివేసి ఉద్యోగులను లోపలికి రానీయకుండా అడ్డుకున్నారని అల్వాల్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయ డిప్యూటీ కమిషనర్‌ వి.శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. ఓపికగా కార్యాలయం ముందు తన కారులో వేచి ఉన్నానని ఫిర్యాదుదారు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. సుమారు గంటపాటు అడ్డుకోవడంతో వారు ఆయనను, ఆయన కార్యాలయ ఉద్యోగులను లోపలికి రానీయకుండా అడ్డుకోవడంతో కారు దిగి ఎమ్మెల్యే వద్దకు రిప్రజెంటేషన లెటర్ తీసుకోవడానికి వచ్చారు.

"ఎమ్ డీసీ గారూ, ఎక్కువ చేస్తున్నారూ, నా సంగతి తెలుసా, నీ అంతు చూస్తా, నేనెంటో చూపిస్తా" అని ఎమ్మెల్యే తనను బెదిరించారని డీసీని ఉటంకిస్తూ పోలీసులు చెప్పారు. ఎమ్మెల్యే అనుచరులు డోలి రమేశ్, డిల్లి పరమేశ్ డీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రతీకారం తీర్చుకోవాలని బెదిరించారు. ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై ఐపీసీ సెక్షన్‌ 149, 186, 189, 341, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు ఎంఎల్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమంలో దుండిగల్‌ మున్సిపల్‌ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తులో అధికారులు జేసీబీతో ఎమ్మెల్యేకు సంబంధించిన కళాశాల ఆవరణలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. MLRIT ఇంజినీరింగ్ కళాశాల ఏరోనాటికల్ ఎన్‌క్లేవ్‌లో అక్రమ నిర్మాణాలు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి చెందినవి. చిన దామర చెరువును ఆక్రమించి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై గతంలో ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు పెద్దఎత్తున కూల్చివేతలు చేపట్టారు.

Next Story