Hyderabad: బిల్ బోర్డు కూలి.. మీదపడటంతో హోటల్ ఉద్యోగికి తీవ్ర గాయాలు

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద బిల్ బోర్డు కూలడంతో హోటల్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి.

By అంజి  Published on  9 April 2024 4:20 AM GMT
Meridian Hotel employee, billboard, Hyderabad

Hyderabad: బిల్ బోర్డు కూలి.. మీదపడటంతో హోటల్ ఉద్యోగికి తీవ్ర గాయాలు

హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద బిల్ బోర్డు కూలడంతో హోటల్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. షిఫ్ట్‌ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

పంజాగుట్ట మెరిడియన్ హోటల్‌లో పనిచేస్తున్న సూరజ్‌కుమార్‌ సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా కొత్తగా నిర్మిస్తున్న భవనం బిల్‌బోర్డ్‌ కూలిపోయింది. టైమ్స్ స్క్వేర్ భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్‌బోర్డ్ సూరజ్‌కుమార్‌ను తాకడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే సూరజ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బిల్‌బోర్డ్ కూలిపోవడంతో ఆ ప్రాంతమంతటా నిర్మాణ స్థలాల్లో అమలవుతున్న భద్రతా చర్యల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story