Hyderabad: టైరు పేలి.. లారీని ఢీకొట్టిన కారు

రంగారెడ్డి జిల్లాలోని మైలారదేవుపల్లి దుర్గా నగర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.

By అంజి  Published on  26 July 2023 5:24 AM GMT
car hit a lorry, burst tire, Mailardevpally, Hyderabad

Hyderabad: టైరు పేలి.. లారీని ఢీకొట్టిన కారు

రంగారెడ్డి జిల్లాలోని మైలారదేవుపల్లి దుర్గా నగర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ కారును ఈడ్చుకుంటూ వెళ్లిన ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. మనిషికి ఆయుషు ఆ దేవుడిచ్చిన వరం. ఎప్పుడు ఏ విధంగా మనల్ని మృత్యువు కబలిస్తుందో తెలియదు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే మృత్యువు దగ్గరి దాకా వెళ్లి ప్రాణాలతో బయట పడుతూ ఉంటారు. మృత్యువును జయించి ఆ విధంగా ప్రాణాలతో బయటపడడం నిజంగా దేవుడు ఇచ్చిన వరం అని చెప్పవచ్చు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మైలార్‌దేవ్‌ పల్లి దుర్గా నగర్ నుండి చాంద్రాయణ గుట్టవైపు వెళుతున్న ఓ మారుతి కారు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పక్కన వెళుతున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆ లారీ అత్యంత వేగంగా కారును ఈడ్చుకుంటూ కొంత దూరం వరకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story