అనుమానాస్పద స్థితిలో 10 ఏళ్ల బాలిక మృతి

By అంజి  Published on  27 Nov 2019 8:16 AM GMT
అనుమానాస్పద స్థితిలో 10 ఏళ్ల బాలిక మృతి

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీదు బండలో నాగేశ్వరి అనే 10 ఏళ్ళ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో బయటకు వెళ్తున్నానని చెప్పింది. నాగేశ్వరి ఎంతకు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గాలించారు. దీంతో సమీపంలోని భవనంపై నుంచి దూకి నాగేశ్వరి మృతి చెందినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. మహబూబ్ బాగర్ జిల్లా వనపర్తి కి చెందిన మొగులయ్య, పద్మ దంపతుల కుమార్తె నాగేశ్వరీ. మజీద్‌ బండలో నాగేశ్వరి తల్లిదండ్రులు టీస్టాల్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story