గుహవాటి జైల్లో 435 ఖైదీలకు కరోనా

By సుభాష్  Published on  25 July 2020 7:21 AM GMT
గుహవాటి జైల్లో 435 ఖైదీలకు కరోనా

కరోనా వైరస్‌ ఎవ్వరిని వదలడం లేదు. చివరకు జైల్లో ఉన్న ఖైదీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. జైల్లో ఉన్నఖైదీలకు కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని బైటా ఆస్పత్రిలో చికిత్సకు తరలిస్తున్న క్రమంలో వారు అక్కడి నుంచి తప్పించుకుపోతున్నారు. దీంతో అసోంలోని గుహవాటి జైలును కరోనా చికిత్సా కేంద్రంగా మార్చేశారు.

ఇదిలా ఉండగా, అసోం జైల్లో కరోనా సోకుతున్న ఖైదీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇలా రాష్ట్రంలోని పది జైళ్లలో మొత్తం 535 ఖైదీలు కరోనా బారిన పడ్డారని రాష్ట్ర జైళ్ల శాఖ ఇన్స్‌ పెక్టర్‌ జనరల్‌ దశరథ్‌ దాస్‌ తెలిపారు.

ఒక్క గుహవాటి జైలోలోనే 435 మంది ఖైదీలకు కరోనా సోకిట్లు నిర్ధారణ అయ్యింది. దాదాపు 200 బెడ్లతో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మారిన గుహవాటి జైలులో కరోనా సోకిన వారంతా చికిత్స పొందుతున్నారు. ఈ జైలులో ఉన్న ఖైదీల్లో 44 శాతం మందికి కరోనా సోకడం తీవ్ర సంచలనంగా మారింది.

Next Story