గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

By సుభాష్  Published on  2 July 2020 5:22 AM GMT
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 16వ నంబర్‌ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు యువకులు గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి విజయవాడకు కారులో బయలుదేరారు. యడ్లపాడు మండలం తిమ్మాపూర్‌ వద్దకు రాగానే గుంటూరు వైపు వెళ్తున్న కంటైనర్‌ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.

దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువులు మృతి చెందారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులురాజుపాలెం మండలం ఇనుమెట్ల గ్రామానికి చెందిన అత్తులూరి బలరాం (25), నరసరావుపేటలోని పనసతోటకు చెందిన ఫిరోజ్‌ అహ్మద్‌ (30), శ్రీనివాస్‌నగర్‌కు చెందిన హరికృష్ణ (26), మేడసాని వెంకట శ్రీచంద్‌ (25) గా గుర్తించారు.

Next Story