రసగుల్లా స్వీట్లు తిని 12 మంది చిన్నారులు అస్వస్థత
By సుభాష్ Published on 3 Oct 2020 1:10 PM ISTస్వీట్లు ఆ చిన్నారులకు విషంగా మారాయి. తూర్పుగోదావరి జిల్లాలో 12 మంది చిన్నారులు స్వీట్స్ తిని అస్వస్థతకు గురయ్యారు. వీఆర్పురం మండలం, పొలుసుమామిడి గ్రామంలో ఈ విషాద ఘటన కలకలం రేపింది. పిల్లల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఓ దుకాణంలో కొనుగోలు చేసిన రసగుల్లాలు తిని 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురై వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో వారి తల్లిదండ్రులు హుటాహుటిన 108 అంబులెన్స్లో వీఆర్పురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అందులో ఐదేళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. మిగతా చిన్నారులందరూ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అలాగే విషమంగా ఉన్న చిన్నారి కూడా క్షేమంగా ఉన్నట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు పిల్లలు తిన్న రసగుల్లా ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.