ముంబాయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మజ్గావ్లోని జీఎస్టీ భవన్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అర్పుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగనట్లు తెలుస్తోంది. ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. భవనంలో కొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.