మూడో విడతలో భారీ ప్యాకేజీ వెల్లడించిన మంత్రి నిర్మలాసీతారామన్
By సుభాష్ Published on 15 May 2020 12:38 PM GMTఇటీవల ప్రధాని నరేంద్రమోదీ రూ.20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మూడో దశ ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి శుక్రవారం సాయంత్రం వివరాలు వెల్లడించారు.
మూడో ప్యాకేజీ వివరాలు :
వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్యాకేజీ ప్రకటన |
మూడో ప్యాకేజీలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత |
11 అంశాలపై ప్రత్యేక దృష్టి |
మత్స్య, పశు సంవర్ధక, డైయిరీ,ఫుడ్ ప్రాసెసింగ్లపై ప్రత్యేక దృష్టి |
వ్యవసాయ రంగానికి రూ. లక్ష కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ |
కోల్డ్ స్టోరేజ్లు, ధాన్యం గిడ్డంగుల నిర్మాణం |
రైతుల నుంచి రూ. 74,300 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు |
రైతుల ఖాతాల్లో రూ.18,700 కోట్ల నగదు బదిలీలు |
డెయిరీ రైతులకు రూ. 5వేల కోట్ల సాయం |
రూ. 30వేల కోట్ల మందికి రైతులకు మేలు |
ఆక్వా రైతుల ఎగుమతుల కోసం ప్రత్యేక కార్యాచరణ |
రూ. 10వేల కోట్లతో స్థానిక ఉత్పత్తుల ఎగుమతి కోసం ప్రత్యేక ప్యాకేజీ |
మత్స్య అనుబంధ రంగాలకు రూ. 20వేల కోట్లు |
త్వరలో 2 లక్షల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు |
ఆక్వా కల్చర్కు రూ. 11వేలకోట్ల ప్యాకేజీ |
ప్రధాని మత్స్య సంపద యోజన కింద రూ. 20వేల కోట్లతో నిధి |
మత్స్యకారులకు బీమా సదుపాయం |
పశుసంవర్ధక మౌలిక వసతుల కల్పనకు రూ.15వేల కోట్లు |
పశువుల వ్యాక్సిన్స్ల కోసం రూ.13,300 కోట్లు |
ఔషధ మొక్కలు సాగు చేసేందుకు రూ. 4వేల కోట్లతో నిధి |
తేనెటీగల పెంపకందారులకు రూ.5వేల కోట్లు |
Next Story