FactCheck : మయన్మార్ లో చోటు చేసుకున్న ఘటనను భారత్ లో జరిగిందంటూ దుష్ప్రచారం

2022 Video from Myanmar being shared as Assault on Kuki Girl in Manipur. కొందరు వ్యక్తులు ఆయుధాలు ధరించి, మిలటరీ దుస్తులు ధరించి, రోడ్డు మధ్యలో బాలికపై దాడి చేసిన

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Jun 2023 4:15 PM GMT
FactCheck : మయన్మార్ లో చోటు చేసుకున్న ఘటనను భారత్ లో జరిగిందంటూ దుష్ప్రచారం
కొందరు వ్యక్తులు ఆయుధాలు ధరించి, మిలటరీ దుస్తులు ధరించి, రోడ్డు మధ్యలో బాలికపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను షేర్ చేస్తూ మణిపూర్‌ కు సంబంధించినదని చెప్పుకొచ్చారు. సాయుధ వ్యక్తులు 'కుకీ క్రిస్టియన్ మహిళ'ను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, చివరికి కాల్చిచంపారని పేర్కొన్నారు.



ఫేస్‌బుక్ వినియోగదారు వీడియోను షేర్ చేస్తూ, “మణిపూర్ పై మోదీ& షాల నియంత్రణ లేకుండా పోయింది. సాయుధ పౌరులు కుకీ క్రిస్టియన్ యువతిని చిత్రహింసలకు గురిచేసి చివరికి కాల్చి చంపే వీడియోలు వెలుగులోకి వచ్చాయి. మణిపూర్ మండిపోతోంది & మోదీ మౌనంగా ఉన్నారు.” అంటూ పోస్టులు పెట్టారు.

అనేక మంది ఫేస్‌బుక్, ట్విట్టర్ వినియోగదారులు కూడా ఇదే వాదనతో వీడియోను షేర్ చేశారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదని.. భారతదేశానికి ఈ వీడియోకు సంబంధం లేదని న్యూస్ మీటర్ బృందం గుర్తించింది.

ఈ వీడియో 2022 నాటిదని మరియు మయన్మార్‌లోని టము పట్టణంలో జరిగిన సంఘటన అని NewsMeter బృందం కనుగొంది. వీడియో కీఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా.. మేము డిసెంబర్ 9, 2022న రీలీక్ వెబ్‌సైట్‌లో “Cruel Punishment In Myanmar.” పేరుతో ప్రచురించబడిన ఎక్కువ నిడివి ఉన్న వీడియోను మేము కనుగొన్నాము.

దీని నుండి క్యూ తీసుకొని, మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. డిసెంబర్ 6, 2022 నుండి మయన్మార్ నౌ యొక్క నివేదికలో వీడియోకు సంబంధించిన అస్పష్టమైన స్టిల్‌ను కనుగొన్నాము. నివేదిక ప్రకారం, నేషనల్ యూనిటీ గవర్నమెంట్ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి నైంగ్ హ్టూ ఆంగ్ (NUG), ఈ సంఘటన జూన్ 2022లో టము పట్టణంలో జరిగిందని తెలిపారు. ఈ దారుణాన్ని యాంటీ-జుంటా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (PDF) 4వ బెటాలియన్ సభ్యులు చేశారని వార్తా సంస్థకు తెలిపారు.

బెటాలియన్‌కు చెందిన ఇద్దరు పురుషులు మరియు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నామని, హత్యపై మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేస్తోందని కూడా పేర్కొన్నారు.

వీడియో కు సంబంధించిన స్టిల్‌ను కలిగి ఉన్న DVB, ఎలెవెన్ మయన్మార్ వంటి ఇతర వెబ్‌సైట్‌లు కూడా అదే సమాచారంతో సంఘటనను నివేదించాయి.

మణిపూర్‌లో కుకీ క్రైస్తవ మహిళను సాయుధ పౌరులు చంపినట్లు షేర్ చేస్తున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. తప్పుడు వాదనతో మయన్మార్ కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారని మేము నిర్ధారించాము.

Credits : Md Mahfooz Alam



Claim Review:మయన్మార్ లో చోటు చేసుకున్న ఘటనను భారత్ లో జరిగిందంటూ దుష్ప్రచారం
Claimed By:Socialmedia Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook, Twitter
Claim Fact Check:False
Next Story